జిల్లా మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

WGL: మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నిన్న, మొన్నటితో పోలిస్తే ఈ రోజు ధర పెరిగింది. తేజా మిర్చి క్వింటాకు నిన్న రూ.15,500 పలకగా..ఈ రోజు రూ.16 వేలకు చేరింది. అలాగే 341 రకం మిర్చికి గత మంగళవారం రూ.14,000 పలకగా నేడు రూ.13,000కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా నేడు రూ.14,500కి పెరిగింది.