ఏడు గడ్డి వాముల దగ్ధం
KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 7 గడ్డివాములు దగ్ధం అయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, రేవన్న, శివన్న తదితరులకు చెందిన గడ్డి వాములు కాలిపోయాయి. దాదాపు రూ.3 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందని ప్రజలు పేర్కొన్నారు.