మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి: ఎంఈవో

సంగారెడ్డి: జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో మండల స్థాయి క్రీడా పోటీలను మండల విద్యాధికారి విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమైనవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు.