యువకుడి దారుణ హత్య
NGKL: వెల్దండ మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రుద్రాక్ష మహేష్ (28) శుక్రవారం రాత్రి వెల్దండ నుంచి కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో ఓ టిప్పర్ అతడి కారును ఢీకొట్టింది. ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేసి, ఆపై రాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి శనివారం ఉదయం దర్యాప్తు చేపట్టారు.