జిల్లాలో ఈ- ఆఫీస్ వ్యవస్థకు శ్రీకారం
JN: పేపర్ లెస్ పరిపాలన తొలి అడుగుతో సేవలు వేగవంతంగా, పారదర్శకత పెంపు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు జిల్లాలో ఈ- ఆఫీస్ వ్యవస్థకు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఈ- ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందన్నారు. అన్ని ఆఫీస్లో పేపర్ వినియోగాన్ని తగ్గిస్తూ, ఫైళ్లను ఆన్లైన్ ద్వారా నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు.