రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

BPT: పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్టూరు నుంచి గుంటూరుకు గ్రానైట్ పలకలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను, ప్రభుదాస్, నూతలపాడుకు చెందిన సురేంద్రబాబుగా గుర్తించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.