'కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి'
గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు మారినా వారి సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కౌలు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.