'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు'

'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు'

JGL: మల్యాల మండల వ్యాప్తంగా పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సోమవారం రాజారం గ్రామానికి చెందిన పోచంపల్లి కవిత, బాలరాజు ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.