చింతలపూడి ఎమ్మెల్యేకు అధికారుల వినతి
ELR: చింతలపూడిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి, క్రీడా మైదానానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని ఐటీడీఏ అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ను కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం గిరిజన బాలుర వసతి గృహం ఆశ్రమ పాఠశాలగా వృద్ధి చెందిందని అన్నారు.