'ఈనెల 3నుంచి కూసుమంచిలో యూరియా పంపిణీ'

KMM: కూసుమంచి మండలంలోని రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుందని మండల వ్యవసాయ అధికారి వాణి తెలిపారు. జక్కేపల్లి, చేగోమ్మ, కల్లూరుగూడెం సొసైటీలలో, కొత్తగా ఏర్పాటు చేసిన సబ్-సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంటుందని చెప్పారు. రైతులు తమ వెంట పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.