ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు
MDCL: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఉప్పల్కు చెందిన సాయి (24) శాంతినగర్లో పురుగుల మందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు మృతి స్థానికంగా కలకలం రేపింది.