కారుణ్య నియామక పత్రం అందజేత

KDP: అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అనారోగ్యంతో మరణించిన హోంగార్డు ఎస్.రఘు వర్మ (HG 486) సతీమణి కె.విజయ మేరికి కారుణ్య నియామకంలో హోంగార్డు నియామక పత్రాన్ని సోమవారం కడపలో అందజేశారు. పోలీస్ శాఖ అన్ని విధాల అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.