‘సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర’
MNCL: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.