పాక్ ఎయిర్బేస్పై ఆఫ్ఘన్ దాడి
పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. పాక్పై డ్రోన్లతో ఆఫ్ఘాన్ దాడులకు దిగింది. రావల్పిండిలోని కీలక నూర్ఖాన్ ఎయిర్బేస్పై ఆఫ్ఘన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఆ ఎయిర్బేస్ తీవ్రంగా దెబ్బతింది. ఈ దాడిలో ఎంతమంది సైనికులు మృతి చెందారనేది మాత్రం తెలియరాలేదు. అయితే దీనిపై పాక్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.