శ్రీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

శ్రీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

NLG: ప్రతి ఒక్కరూ శ్రీ ధ్యానాంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని 18వ వార్డులో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.