టీమిండియా కంటే ఇంగ్లండే బలమైన జట్టు: వాన్
భారత్తో సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు విజయం సాధిస్తుందని ఆ దేశ మాజీ సారథి మైఖేల్ వాన్ ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాతో పోలిస్తే ఇంగ్లండ్ జట్టు చాలా బలంగా ఉందన్నాడు. ముఖ్యంగా జోస్ బట్లర్ ఫామ్లోకి వస్తే ఇంగ్లండ్కు తిరుగుండదని వ్యాఖ్యానించాడు. వాంఖడే వేదికగా భారత్పై గెలిచి ఫైనల్ చేరడం ఖాయమని పేర్కొన్నాడు.