మోసపూరి పథకాలపై అవగాహన కల్పించిన సీఐ
NTR: జి.కొండూరు మండలం చెమటూరులో పోలీసుల ఆధ్వర్యంలో మోసపూరిత పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ.. అధిక లాభాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంక్ వివరాలు, OTP ఇవ్వరాదని సూచించారు. కష్టార్జిత డబ్బును అవసరాలకు వినియోగించుకోవాలని, ఖరీదైన బైకులు ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపారు.