రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్
ప్రకాశం: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో మంగళవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ గురించి రైతులకు వివరించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.