రొళ్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై నేడు అవిశ్వాస తీర్మానం
సత్యసాయి: రొళ్ల మండల పరిషత్లో ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మలపై అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం పెనుకొండ ఆర్డీఓ ఆనంద్కుమార్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8న 11 మందిలో 8 మంది ఎంపీటీసీలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఆ 8 మంది సభ్యులు నేడు నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి రానున్నట్లు సమాచారం.