GREAT.. వారి మరణం.. 9 మందికి ప్రాణం.!
HYD: GHMC పీర్జాదిగూడ సర్కిల్ చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్ల రూపంలో 9 మందికి కొత్త జీవం లభించింది. తమ బాధను పక్కన పెట్టి చూపిన వారి త్యాగం అందరికీ స్ఫూర్తి.