రెండోరోజు టీడీపీ నేతలకు శిక్షణ తరగతులు
AP: టీడీపీ ముఖ్యనేతలకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ రెండోరోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా పలువురు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. కాగా, మొదటిరోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో వందమంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పాల్గొన్నారు.