'లోక్ అదాలత్ తో కేసులు పరిష్కరించాలి'
GDWL: జిల్లాలో డిసెంబర్ 21న జరిగే జాతీయలోక్ అదాలత్ తో రాజీ కాదగిన కేసులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అధికారులను ఆదేశించారు. సోమవారం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా, క్రిమినల్ కేసుల రాజీ విషయమై అవగాహన కల్పించారు.