నూతన సచివాలయ భవనం ప్రారంభం

నూతన సచివాలయ భవనం ప్రారంభం

ASR: నూతనంగా నిర్మించిన కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గ్రామ సచివాలయ భవనం బుధవారం ప్రారంభమైంది. పంచాయతీ సర్పంచ్ పీటా సింహాచలం, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బషీర్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ సచివాలయ భవనం లేక పంచాయతీ, సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు.