'ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి'
BHNG: ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి MP, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీ నగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ను ఆయన సందర్శించి నిర్మాణ పనులుతో పాటు వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.