రన్నింగ్ పోటీలో కానిస్టేబుల్ ప్రతిభ.. అభినందించిన సీపీ
KMM: రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ బాబు ఇటీవల హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రన్నింగ్ పోటీలో పాల్గొని విజయం సాధించారు. 400 మీటర్ల ట్రాక్పై మొత్తం 254 రౌండ్లు (101.6 కిలోమీటర్లు) పూర్తి చేసి, 3వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో శనివారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కానిస్టేబుల్ను అభినందించారు.