"అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు'

మంచిర్యాల: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.