పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: కౌన్సిలర్
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కౌన్సిలర్ సరిత ఆంజనేయులు తెలిపారు. బుధవారం బహార్పేట చౌరస్తా సమీప కాలనీల్లో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను మున్సిపాలిటీ సిబ్బందితో శుభ్రం చేయించారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలో ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు.