శ్రీ మఠం అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.లక్ష విరాళంగా వచ్చినట్లు సోమవారం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే భక్తుడు విరాళం అందజేశారన్నారు. ఈ విరాళాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని భక్తుడు కోరారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన కల్పించి, ఆశీర్వచనాలు అందజేశారు.