ఈ నెల 30 నాటికి మెట్రో రైలు ప్రభుత్వ పరం!
TG: హైదరాబాద్ మెట్రోరైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలో కీలక అడుగు ముందుకుపడింది. దాదాపు రూ.13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంగీకరించింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 30 నాటికి మెట్రోరైలు ప్రభుత్వ పరం కానుంది. ఈ రుణాన్ని20 ఏళ్ల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.