విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.82 వేలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం స్వామి వారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.82,485 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 40 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 16 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.