BREAKING: ప్రాథమిక కీ విడుదల

BREAKING: ప్రాథమిక కీ విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక 'కీ' విడుదలైంది. పేపర్-1, 2 ప్రశ్నాపత్రాలతో కూడిన ఆన్సర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఐఐటీ కాన్పూర్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ వరకు విద్యార్థులు 'కీ'పై అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ఈ నెల 18న జరిగిన పరీక్షకు 2లక్షల మంది హాజరయ్యారు. కాగా, వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.