బీజేపీ నేత శివప్రసాద్కు ‘సంత్ గాడ్గే బాబా’ అవార్డు
E.G: గోకవరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కరాసు శివప్రసాద్ గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సంత్ గాడ్గే బాబా అవార్డు అందుకున్నారు. రజక జాతి అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను సమాజానికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని బీజేపీ నేత ఉంగరాల ఆది విష్ణు తెలిపారు.