కాశినాయన మండలంలో విషాదం
KDP: కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దిలీప్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. దిలీప్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.