'విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి'

'విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి'

BDK: మణుగూరు మహాత్మా పూలే గురుకుల పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు.