సీతారామాలయంలో వైభవంగా సుదర్శన హోమం

జనగామ: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సీతారాముల ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని సుదర్శన హోమం నిర్వహించారు. అర్చకుడు మోహన కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. స్థానిక భక్తులు పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.