కేటీఆర్ అబద్ధాల్లో నోబెల్ ఇవ్వొచ్చు: పీసీసీ చీఫ్
NGKL: కేటీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు అబద్ధాల్లో నోబెల్ ఇవ్వొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజా పాలనలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.