ప్రభుత్వ కార్యాలయంలో మందు పార్టీ.. విమర్శలు
JGL: జిల్లాలోని NPDCL కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది ఆఫీస్లో మద్యం బాటిళ్లతో పార్టీ చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం సేవించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్లు మద్యం సేవిస్తున్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.