కాలుష్యాన్ని సున్నా స్థాయికి తగ్గించాలి: చంద్రబాబు
AP: రాష్ట్రంలో కాలుష్యాన్ని సున్నా స్థాయికి తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి.. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్జోన్ పరిధిలోని పరిశ్రమలను 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్లో 10 రోజుల్లో, గ్రీన్ జోన్లో 3 రోజుల్లోగా అనుమతులు ఇవ్వాలని సూచించారు.