100% చెత్త సేకరణ జరగాల్సిందే: కమిషనర్
MDCL: 100% ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాల్సిందేనని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కిందిస్థాయి అధికారులకు, స్వచ్ఛ ఆటో కార్మికులకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుండ్ల పోచంపల్లిలో పర్యటించి, చెరువు పరిసరాల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్స్, గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్ చేయాలన్నారు.