ఎట్టకేలకు చిక్కిన చిరుత

ఎట్టకేలకు చిక్కిన చిరుత

MBNR: జిల్లా కేంద్రంలో రెండున్నర నెలలుగా చిరుత పులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఇవాళ తిరుమల దేవుని గుట్ట, వీరన్నపేట ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ చిరుత, ఇళ్ల సమీపంలోకి కూడా రావడంతో ఆందోళనలు పెరిగాయి. చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.