వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

KRNL: బేతంచర్ల పట్టణంలోని హనుమన్నగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సయ్యద్ మోదిన్ (4) అనే బాలుడిని వీధి కుక్కలు కొరికి చంపాయి. హనుమాన్నగర్‌కి చెందిన సయ్యద్ బాషా, ఆశ దంపతుల మూడో కుమారుడు సయ్యద్ మోదిన్ ఆడుకుంటుండగా కుక్కలు లాక్కెళ్లాయి. తీవ్రంగా గాయపరచడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు.