'44 గంటలు సైలెంట్ పీరియడ్ అమలు'
KNR: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, చేయరాదన్నారు.