VIDEO: గోడౌన్లో ఈవీఎమ్ల భద్రతా ఏర్పాట్ల పరిశీలన
E.G: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్లను తనిఖీ చేసినట్లు ఆర్డీవో టి.సీతారామ మూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజమండ్రిలోని ఎఫ్సీఐ గోడౌన్ ఆవరణలో భద్రపరచిన ఈవీఎమ్ గోడౌన్ను ఆయన పరిశీలించారు.