నదిలో మునిగి వేక్తి మృతి..!
AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలోని వరహానదిలో సోమవారం వినయ్ కుమార్ (22) ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. పశువులు మేపుతుండగా ఒక ఆవు నీటిలోకి వెళ్లడంతో దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమిచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.