ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ తుహీన్ సిన్హా పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందన్నారు.