ప్రజలకు చేరువగా పోలీసింగ్: ఎస్పీ
NLG: ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ అందించాలనే లక్ష్యంతో జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ సోమవారం పోలీసు కార్యాలయంలో 'గ్రీవెన్స్ డే' నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి వేగంగా స్పందించేందుకు అధికారులకు సూచించారు.