'చిట్యాలకు రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలి'
NLG: చిట్యాలకు రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని బీజేపీ జిల్లా నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత చికిలమెట్ల అశోక్ ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన MRO సస్పెండ్ కావడంతో డిప్యూటీ MRO ఇంఛార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.