నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: భైంసా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేగాం సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున వినియోగదారులు గమనించి ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.