ఉప సర్పంచ్ మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే
JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ ఉప సర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు నేడు వారి కుటుంబ సభ్యులను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.