ఆత్మహత్యల నివారణకు అవగాహన కార్యక్రమాలు: DCP

MNCL: రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించాలని, పశువులు రోడ్లపైకి వస్తే యజమానులపై కేసులు నమోదు చేయాలని మంచిర్యాల DCP భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు, ఆత్మహత్యలు, మిస్సింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. దొంగతనాల నివారణకు పెట్రోలింగ్, తనిఖీలు చేయాలని, ఆత్మహత్యలను నివారించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.